ఈరోజు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిన చిరంజీవి, సాయి ధరమ్ తేజ్

  • August 16, 2017 / 02:05 PM IST

అనుకోకుండా చేశారో, అనుకోని చేశారో తెలియదు గానీ మామ అల్లుళ్లు ఈరోజు తమ కొత్త సినిమాలను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 తరవాత చేయనున్న సినిమాకి ఈరోజు మధ్యాహ్నం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్, డైరక్టర్ సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్, పరుచూరి బ్రదర్స్ పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం లోగోని చిరంజీవి పుట్టినరోజు(ఆగస్టు 22) న రిలీజ్ చేయనున్నారు. ఇక వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్ ఇటీవలే జవాన్ సినిమాను కంప్లీట్ చేశారు.

గత వారం స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించారు. ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లకముందే కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమాను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు సమర్పణలో వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus