Nagarjuna: నాగ్ పరువు మొత్తం పోగొట్టుకున్నాడు.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!

  • October 13, 2024 / 07:29 PM IST

ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా నాగార్జున పేరు వినిపించిన సంగతి తెలిసిందే. నాగ్ (Nagarjuna) తప్పేం లేకపోయినా మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం గురించి కొన్ని కామెంట్లు చేయడం నెట్టింట సంచలనం అయింది. అయితే సీపీఐ నారాయణ నాగార్జున పరువు నష్టం దావా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నందుకు నాగార్జునకు పరువు లేదు అంటూ ఆయన కామెంట్లు చేశారు. నాగ్ పరువు మొత్తం పోగొట్టుకున్నాడంటూ సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Nagarjuna

పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేస్తారా అని సీపీఐ నారాయణ అన్నారు. బిగ్ బాస్ షో ద్వారా పరువు పోగొట్టుకున్న నాగ్ కొండా సురేఖపై కోర్టులో దావా వేశారని ఆయన కామెంట్లు చేశారు. సమంత (Samantha) కోర్టును ఆశ్రయిస్తే అర్థం ఉంటుంది కానీ బిగ్ బాస్ ద్వారా అన్ పాపులర్ అయిన నాగ్ దావా వేయడంలో అర్థం లేదని ఆయన తెలిపారు.

కొండా సురేఖ తాను చేసిన కామెంట్ల విషయంలో ఇప్పటికే క్షమాపణలు చెప్పడం జరిగిందని ఈ విషయంలో కోర్టుకు వెళ్లాల్సిన అవసరమే లేదని ఆయన పేర్కొన్నారు. నాగార్జున పరువు నష్టం దావా వేయడం అంటే అది జోక్ తప్ప ఇంకేం కాదని సీపీఐ నారాయణ చెప్పుకొచ్చారు. సీపీఐ నారాయణ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

సీపీఐ నారాయణ చేసిన కామెంట్ల విషయంలో నాగార్జున రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. నాగార్జున ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. నాగార్జున తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. నాగార్జున కుబేర, కూలీ (Coolie) సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దంటున్న ఫ్యాన్స్.. చైతన్య ఏం చేస్తారో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus