‘అల వైకుంఠపురములో’ నుండీ డిలీటెడ్ సీన్.. నెటిజెన్ల రియాక్షన్ ఇలా..!

  • March 16, 2020 / 06:14 PM IST

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన.. అల్లుఅర్జున్, త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన సినిమా ఇది. అంతేకాదు త్రివిక్రమ్ తో బన్నీ హ్యాట్రిక్ కూడా కంప్లీట్ చేసాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బడా చిత్రంతో పోటీ పడి మరీ 160 కోట్ల షేర్ ను రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన పాన్ ఇండియా చిత్రం.. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి కూడా రాని కలెక్షన్లు ఈ చిత్రానికి వచ్చాయి. అంతేకాదు తెలుగురాష్ట్రాల్లో ఏకంగా ‘బాహుబలి1’ కలెక్షన్స్ నే అధిగమించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం నుండీ డిలీటెడ్ సీన్ ని యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ సీన్లో బంటు(అల్లు అర్జున్) స్విమ్మింగ్ పూల్ దగ్గర జ్యూస్ తీసి రాజ్(సుశాంత్) ఇస్తూ.. తను స్మోక్ చేస్తున్న వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఫలితంగా రోడ్డు పై పరుగెత్తుతూ ఆఫీస్ కు వెళ్లాలని కండిషన్ పెడతాడు. అలా బంటు పెంపుడు తండ్రి పై పగ తీర్చుకుంటాడనేది సారాంశం కావచ్చు. అయితే ఈ సీన్ ను చూసిన నెటిజన్లు.. ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ‘ఈ సీన్ తీసెయ్యడమే మంచిదయ్యింది’, ‘ఇదేం సీన్ రా బాబు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus