మణిశర్మ వల్లే ‘అతడు’ కి సంగీతం ఇవ్వలేదంటున్న దేవి..!

  • March 24, 2021 / 11:39 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘అతడు’ చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు. బహుశా మన ప్రమేయం లేకుండానే ఈ చిత్రాన్ని ఎక్కువ సార్లు చూసి ఉంటాము అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రంలోని ప్రతీ ఎమోషనల్ సీన్, వచ్చే డైలాగ్, కామెడీ ఎంతగా ఆకట్టుకుంటాయో..పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతకు మించి ఆకట్టుకుంటాయి.

మణిశర్మ సంగీతం ఆ స్థాయిలో ఉంటుంది. అయితే ‘అతడు’ చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట మణిశర్మనే అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వలన అతను తప్పుకోవడానికి రెడీ అయ్యాడట. ఆ టైములో దర్శకనిర్మాతలు దేవి శ్రీ ప్రసాద్ ను సంప్రదించారట. నిజానికి మహేష్ బాబు- దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రావాల్సిన మొదటి చిత్రం ఇదే. కానీ దేవి ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేసాడట. దానికి దేవి చెప్పిన సమాధానం ఇదేనట.. ‘మణిశర్మ గారు నాకు అత్యంత ఆత్మీయులు. నేను ఈ ప్రాజెక్టు చెయ్యలేను.

ఆయనే కాదు వేరే సంగీత దర్శకుడు ప్రారంభించిన చిత్రాన్ని వాళ్ళ అనుమతి లేకుండా నేను స్వీకరించలేను. నేను విలువలు పాటిస్తాను’ అంటూ చెప్పాడట. గతంలో మణిశర్మ దగ్గర దేవి శ్రీ ప్రసాద్ పనిచేసాడు. మహేష్ బాబు- మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన ‘వంశీ’ చిత్రంలో ‘వెచ్చ వెచ్చగా’ అనే హిట్ సాంగ్ ను రాసి పాడింది కూడా దేవినే..! గురువు సినిమా కాబట్టి.. ఆయన స్థాయిలో పని చెయ్యలేను అనే ఉద్దేశంతో దేవి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. అయినప్పటికీ ‘అతడు’ కి మణిశర్మ అందించిన ట్యూన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నది అక్షర సత్యం.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus