Aditya Hasan: ‘బాయ్స్‌’లో మెయిన్‌ పాయింట్‌తో ‘స్వాతి టీచర్‌’ నిజమేనా?

Advertisement

ఒక వేశ్య… ఆమె దగ్గరకు వెళ్లిన నలుగురు కుర్రాళ్లు… అనుకున్నట్లుగా అక్కడేమీ జరగలేదు. అయితే ఆ నలుగురి జీవితాన్ని ఆమె మార్చేసింది. ఎలా మార్చేసింది, ఏం మార్చేసింది. ఇదీ త్వరలో తెలుగులో రూపొందబోతున్న ఓ సినిమా కథ. ఏంటీ ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. సేమ్‌ టు సేమ్‌ పాయింట్‌తో గతంలో మన దగ్గర ఓ సినిమా వచ్చింది. అయితే మొత్తం సినిమాలో అదొక టర్నింగ్‌ పాయింట్‌ మాత్రమే. అయితే ఇప్పుడు ఇదే మెయిన్‌ పాయింట్‌గా ఓ సినిమా రూపొందుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

తెలుగులో ఇటీవల కాలంలో మంచి విజయం అందుకున్న తెలుగు వెబ్‌ సిరీస్‌ అంటే #90s అని చెప్పాలి. శివాజీ (Sivaji) , వాసుకి (Vasuki Anand) ప్రధాన పాత్రల్లో నటించిన ఆ ఎమోషనల్ డ్రామా భారీ విజయాన్నే అందుకుంది. దీని వెనుకున్న మాస్టర్‌ మైండ్‌ ఆదిత్య హాసన్ (Aditya Haasan). ఈ యువ దర్శక రచయిత ఆ తర్వాత ‘ప్రేమలు’ (Premalu) సినిమా తెలుగు వెర్షన్‌కు మాటలు రాసి వావ్‌ అనిపించారు. ఇప్పుడు ఆయనే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

‘స్వాతి టీచర్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ ఇదే అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నిజానికి వెబ్‌ సిరీస్‌ కోసం రాసుకున్న ఈ కథను ఇప్పుడు సినిమాగా మార్చి తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ ఇదే అంటూ వినిపిస్తున్న టాక్‌ ప్రకారం అయితే… నలుగురు టీనేజ్ కుర్రాళ్లు ఒక వేశ్య దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట.

అలా అని ఇదేమీ బోల్డ్‌ సినిమా కాదట. ఎలాంటి అశ్లీలత లేకుండా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తారట. నవీన్ మేడారం (Naveen Medaram)  నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ అయిపోయింది. ఇందులో నటించబోయే టీమ్‌ అంతా మనకు వివిధ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా తెలిసిన ముఖాలే అంటున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read