కోర్ట్ లో పిటీషన్ వేసిన పింక్ నిర్మాత దిల్ రాజు

  • February 3, 2020 / 02:08 PM IST

పవన్ 26వ చిత్రానికి నిర్మాతగా ఉన్న మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పవన్ హీరోగా తాను నిర్మిస్తున్న సినిమాకు సంబంధించి ఎటువంటి ఫోటోలు, వీడియోలు సామజిక మాధ్యమాలలో కానీ, వెబ్ సైట్స్ లో కానీ అప్లోడ్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఆయన పిటీషన్ లో పేర్కొనడం జరిగింది. వారి అనుమతి లేకుండా అనధికారికంగా షూటింగ్ సెట్స్ లోని ఫొటోస్, వీడియోస్ ఎవరు షేర్ చేసినా వారికి 5000 రూపాయల జరిమానా, ఒక ఏడాది వరకు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని దిల్ రాజు పిటీషన్ లో పేర్కొనడం జరిగింది. పవన్ కమ్ బ్యాక్ మూవీ పింక్ రీమేక్ కి నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ షురూ చేశారు. కాగా ఈ చిత్ర షూటింగ్ మొదలైన మొదటిరోజే సెట్స్ లోని పవన్ గెటప్ బయటికి రావడం జరిగింది. జీన్స్ మరియు జాకెట్ ధరించి వీధిలో నడుచుకుంటూ వెళుతున్న పవన్ కళ్యాణ్ ఫోటో సామజిక మాధ్యమాలలో హల్ చల్ చేసింది.

ఈ లీకులపై పవన్ నిర్మాత పై ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనితో లీగల్ గా మాత్రమే దీనికి అడ్డుకట్ట వేయగలం అని భావించిన దిల్ రాజు కోర్టులో పిటీషన్ వేశారు. మరి దీనిపై కోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన 27వ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తో పీరియడ్ మూవీ చేస్తున్నారు. మరియు రెండు రోజుల క్రితం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో 29వ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. దీనితో పవన్ ఎప్పుడూ లేని విధంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus