Dil Raju: మొదటిసారి కొడుకుతో మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు!

  • August 5, 2022 / 04:39 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు దిల్ రాజు.కెరియర్ మొదట్లో డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్న ఈయన దిల్ సినిమాతో నిర్మాతగా మారిపోయారు. ఈ సినిమా మంచి హిట్ కొట్టడంతో సినిమా పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇలా చిన్న బడ్జెట్ సినిమాల నుంచి ఈయన భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే స్థాయికి ఇండస్ట్రీలో ఏదిగారు. ఇకపోతే దిల్ రాజు మొదటి భార్య అనిత 2017వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే

అయితే ఈయన కూతురు హన్షిత రెడ్డి తన తండ్రి ఒంటరిగా ఉండడం చూడలేక తన సమీప బంధువు అమ్మాయి తేజస్విని తన తండ్రికి రెండవ వివాహం చేశారు. అప్పటికే దిల్ రాజ్ కుమార్తెకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ఈ విధంగా తేజస్విని రెండవ వివాహం చేసుకున్న దిల్ రాజు తాజాగా జూన్ 29వ తేదీ దిల్ తేజస్విని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.అయితే తనకు వారసుడు వచ్చాడంటూ దిల్ రాజు తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే మొదటిసారిగా తన కుమారుడితో ఈయన మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు తన భార్య కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం బయటపడటంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈయన సినిమాల విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చిందని చెప్పాలి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus