Trinadha Rao Nakkina: సినీ పరిశ్రమలో విషాదం.. దర్శకుడు త్రినాథరావు నక్కిన తండ్రి కన్నుమూత

  • April 30, 2024 / 08:46 PM IST

సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి, సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్ వంటి వారు మృతి చెందారు. టాలీవుడ్లోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ, హిందీ, హాలీవుడ్.. సినీ పరిశ్రమల్లో కూడా విషాదాలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

విషయంలోకి వెళితే.. దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) తండ్రి నక్కిన సూర్యారావు నిన్న మరణించారు. అనకాపల్లిలోని ఆయన స్వగృహమందే ఆయన ప్రాణాలు విడిచినట్టు తెలుస్తుంది.ఇక సూర్యారావు అంత్యక్రియలు రేపు అనగా బుధవారం నాడు నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) , నిర్మాత రాజేష్ దండ (Rajesh Danda) వంటి వారితో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలుస్తుంది. వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా నటించిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన త్రినాథ రావు..

‘మేం వయసుకు వచ్చాం’ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్’ (Nenu Local) , ‘హలో గురు ప్రేమ కోసమే’ (Hello Guru Prema Kosame) ‘ధమాకా’ (Dhamaka) వంటి హిట్ సినిమాలు తీశాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ తో ఓ సినిమా చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా మారి ‘నక్కిన నెరేటివ్’ బ్యానర్ పై ‘చౌర్య పాఠం’ అనే చిన్న సినిమాని రూపొందిస్తూ బిజీగా గడుపుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus