Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 : కోడిగుడ్ల టాస్కులో ఈ దరిద్రం ఏంటి.. పిల్లలను దూరం పెట్టాల్సిందేనా?

  • September 20, 2024 / 01:17 PM IST

‘బిగ్‌బాస్ సీజన్ల యందు 8వ (Bigg Boss 8 Telugu) సీజన్ వేరయా’ అని చెప్పాలి..! హౌస్లో.. ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, వంటివి కామన్. కానీ ఈసారి అంతకు మించి అనేలా.. ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం, జుట్లు పట్టుకుని కొట్టుకోవడం, మేల్ కంటెస్టెంట్లు అయితే ఫిమేల్ కంటెస్టెంట్ల ప్రైవేట్ పార్టులపై చేతులు వేయడం వంటి దరిద్రాలు కూడా చోటు చేసుకున్నాయి.ప్రేరణ (Prerana)  -విష్ణుప్రియ (Vishnu Priya)  ..లు నీళ్ల ట్యాంకుల వద్ద గొడవ పడినట్టు గొడవపడ్డారు.పృథ్వీ (Prithviraj) అయితే మణికంఠని (Naga Manikanta)  బూతులు తిడుతూ రెచ్చిపోయాడు అనే చెప్పాలి. హౌస్‌లో కోడిగుడ్లు కలెక్ట్ చేసే గేమ్ ఆడుతున్న క్రమంలో ఇదంతా జరిగింది.

Bigg Boss 8 Telugu

శక్తి (నిఖిల్) (Nikhil) టీమ్ ఎక్కువ ఎగ్స్ కలెక్ట్ చేయడంతో, కాంతార టీమ్ నుండి నబీల్ (Nabeel Afridi)  ఔట్ అయ్యాడు.నబీల్‌ సంచాలక్..గా వ్యవహరించాడు. గేమ్ బాగానే సాగుతుంది అనుకుంటున్న టైంలో శక్తి టీంలో ఉన్న సోనియా.. కాంతార టీమ్ బుట్టలోని ఎగ్స్ కొట్టేసింది. దీంతో యష్మీ (Yashmi Gowda)   కూడా శక్తి టీమ్ కి చెందిన 4 గుడ్లు కొట్టేయడం జరిగింది. దీంతో రెండు టీంల మధ్య గొడవలు మొదలయ్యాయి. నిఖిల్ వెళ్లి కాంతార టీమ్ బుట్టలో ఎగ్స్ దోచేశాడు. ఆ టైంలో నిఖిల్-యష్మీ..ల మధ్య మాటల యుద్ధం నడిచింది.

అటు తర్వాత ‘నిన్న నబీల్ నన్ను తాకరాని చోట తాకబోయాడంటూ’ చెప్పబోయి తర్వాత.. తన మాట వెనక్కి తీసుకుంది విష్ణుప్రియ. రాంగ్ వర్డ్స్ యూజ్ చేసినందుకు సారీ.. నిన్ను హర్ట్ చేయాలని అలా అనలేదు.. నువ్వు చాలా మంచి అబ్బాయ్’ అంటూ విష్ణుప్రియ  (Vishnu Priya)  అతనికి సారీ చెప్పింది. ఇక కిచెన్లో కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చాడు బిగ్ బాస్ (Bigg Boss 8 Telugu). ఒక టీమ్ మాత్రమే వంట చేయాలి… అందులోనూ ఆ టీంకి సంబందించిన ముగ్గురు మాత్రమే కిచెన్‌లో ఉండాలి అనే నిబంధన పెట్టాడు. ఈ క్రమంలో ‘కాంతార’ టీం చీఫ్ అయినటువంటి అభయ్  (Abhay Naveen) .. ‘

ఈ రూల్స్ పెట్టినోళ్లు మనిషి పుట్టుక పుట్టారా లేదా .. అంతమంది హౌస్మేట్స్ కి ముగ్గురు మాత్రమే ఎలా వంట చేస్తారు.. తినడానికి టాస్కులు పెడుతున్నారో తినకుండా చేయడానికి టాస్కులు పెడుతున్నారో.., నీయమ్మ… సైకోగాళ్లు.. పిచ్చి రూల్స్.. సైకోగాడివి బిగ్‌బాస్’ అంటూ రెచ్చిపోయాడు. నెక్స్ట్ రోజు మళ్ళీ ఎగ్స్ గేమ్ మొదలైంది. పృథ్వీ అయితే రెచ్చిపోయాడు. ఎగ్స్ తీసుకోకుండా అందరినీ తోసేస్తుంటే.. ‘ఎందుకు పృథ్వీ’ అంటూ ఆదిత్య (Aditya OM) , మణికంఠ అమాయకుల్లా అడిగారు. ఈ క్రమంలో ‘అమ్మాయిలా ఏడిస్తే ఇక్కడొద్దు పొండి ఇక్కడి నుంచి’ అంటూ పృథ్వీ నోరు జారాడు.

ఈ క్రమంలో మణికంఠ.. ‘మైండ్ యువర్ టంగ్’..పృథ్వీ అంటూ మణికంఠ మాటల యుద్ధానికి దిగాడు. మరోపక్క అమ్మాయిలు అనే కనికరం లేకుండా ఓ చేత్తో యష్మీ, మరో చేత్తో ప్రేరణను పట్టుకుని కదలకుండా చేశాడు. ఆ టైంలో ప్రేరణ.. పృథ్వీపై చెయ్యి చేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ చేసుకుంది. ఆ తర్వాత కూడా అమ్మాయిలను మేల్ కంటెస్టెంట్లు.. తాకరాని చోట్ల తాకడం జరిగింది. వీటికి సంబంధించిన విజువల్స్ ను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘పిల్లలు చూసే విధంగా ఉందా ఇది’ ‘ఇదేం దరిద్రంరా బాబు’ అంటూ మండిపడుతున్నారు.

 ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాన్స్‌ చెప్పిన తమన్‌.. తేడా కొడుతోంది రాజుగారూ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus