‘గామా’ (GAMA-Gulf Academy Movie Awards) అవార్డ్స్ అంటే ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది. గతంలో దుబాయ్లో ఈ అవార్డు వేడుకలు నిర్వహించారు.ఇప్పుడు 5వ ఎడిషన్ వేడుకలకి రంగం సిద్ధమైంది. ఈసారి కూడా దుబాయ్లోనే ఈ వేడుక జరగనుంది. ఆగస్టు 30న షార్జా ఎక్స్పో సెంటర్లో ‘గామా’ అవార్డుల వేడుకలు నిర్వహించనున్నారు. దీని టైటిల్స్ స్పాన్సర్ గా వైభవ్ జ్యువెలర్స్ సంస్థ వ్యవహరిస్తోంది.ఇక ఆ వేడుకల ప్రమోషన్లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ ను నిర్వహించారు అధికారులు. ఇందులో గామా సీఈవో సౌరబ్ కేసరి, వైభవ్ జ్యువెలర్స్ ఎండి రాఘవ్, జ్యూరీ సభ్యులు, సీనియర్ స్టార్ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి గారు, బి గోపాల్ గారు, హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్ష నగార్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.
GAMA Awards
ఈ సందర్భంగా ‘గామా సీఈవో సౌరబ్ కేసరి మాట్లాడుతూ.. “ఈ ఈవెంట్ ను మేము కమర్షియల్ గా భావించి చేస్తుంది కాదు. మా నాన్న (త్రిమూర్తులు) గారికి కళాకారులపై ఉన్న అభిమానంతో నిర్వహిస్తున్నాం. ఏటా ఈ అవార్డుల వేడుకను అందరి సపోర్ట్ తో ముందుకు తీసుకెళ్తున్నాం.వచ్చే ఏడాది మరింత గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాగే మిగతా దేశాల్లో కూడా గామా అవార్డ్స్ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. దుబాయ్ లో ఉన్న తెలుగు వారితోపాటు ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం. మా జ్యూరీ సభ్యుల సహకారంతో అవార్డుల జాబితాని రెడీ చేశాం” అంటూ చెప్పుకొచ్చారు.
జ్యూరీ సభ్యులు, సీనియర్ స్టార్ దర్శకులు అయిన ఏ కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. ” ఈ అవార్డ్స్ లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను, బి గోపాల్, కోటి సహా పలువురు ప్రముఖులు కూడా జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి అవార్డ్స్ నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి అని చెప్పాలి. ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేయడానికి దోహదపడతాయి. ఆగస్టు 30న దుబాయ్ లో జరగనున్న ఈ గామా అవార్డ్స్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.
జ్యూరీ సభ్యులు, మరో సీనియర్ స్టార్ దర్శకులు బి గోపాల్ మాట్లాడుతూ.. “గామా అవార్డ్స్ చైర్మన్ త్రిమూర్తులు గారు ఈ అవార్డ్ ఫంక్షన్ ను ప్రతి ఏటా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అంతకుమించిన ఉత్సాహంతో నిర్వహించేందుకు సౌరబ్ కేసరి సిద్ధమయ్యారు. అతిరథ మహారథుల సమక్షంలో హీరోయిన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ లతో ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగనుంది” అని తెలిపారు