Mahesh – Sandeep: మరొసారి మహేష్ – సందీప్ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..
- August 11, 2026 / 01:21 PM ISTByFilmy Focus Desk
‘వారణాసి’ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా ఇదే అంటూ గత కొన్ని నెలలుగా ఓ వార్త తెలుగు సినిమా మీడియాలో, సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అదే సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే సినిమా ఇది. ఎవరూ ఈ రూమర్లకు కొట్టిపారేయడం లేదు. అలా అని క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. అయితే, ఇప్పుడు వీటి గురించి దర్శకుడు ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చారా.. అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇదంతా మహేష్బాబు పుట్టిన రోజు సందర్భంగా జరిగింది.
Mahesh – Sandeep
ఈ నెల 9న మహేష్బాబు పుట్టిన రోజు సందర్భంగా సందీప్ రెడ్డి వంగా విష్ చేశారు. మామూలుగా ‘హ్యాపీ బర్త్డే బాబూ’ అని రాసి ఉంటే ఈ డౌట్ వచ్చేది కాదు. కానీ ఆయన ప్రత్యేకంగా ఏఐ వీడియో చేయించి మరీ BOB కళ్లల్లో ఆనందం చూశారు. నిజానికి ఆ వీడియో చాలా బాగా కుదిరింది కూడా. దివంగత సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘కిరాయి కోటిగాడు’ సినిమాలోని ఓ హిట్ ట్రేడ్ మార్క్ డైలాగ్ని అందులో మహేష్తో చెప్పించారు.
అదే ‘ఊరు తెనాలి.. ఉద్యోగం కిరాయి ఉంచుకుని కాళ్లు, చేతులు విరగొట్టం.. వివరాలు చాలుగా’ అనే డైలాగ్. ఈ డైలాగ్ ఎలాంటి మజా ఇస్తుందో మహేష్ – కృష్ణ ఫ్యాన్స్కి బాగా తెలుసు. ఇంతటి బెస్ట్ డైలాగ్తో విషెస్ చెప్పారు అంటే.. తర్వాత తాము చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు అని అనిపిస్తోంది. గతంలో ఈ కాంబో గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ‘డెవిల్’ అనే ప్రాజెక్ట్ పేరు వినిపించింది. మరిప్పుడు ఆ సినిమాలో మహేష్ పాత్ర ఇలానే మాసీగా ఉండబోతోంది అని సందీప్ చెప్పకనే చెప్పారా అనిపిస్తోంది.
ప్రస్తుతం సందీప్ ‘స్పిరిట్’ సినిమాతో బిజీగా ఉండగా.. మహేష్ ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండూ అయ్యాకనే ‘డెవిల్’ సంగతి తేలుతుంది. చూద్దాం ఊర మాసీ క్లాసీ సినిమా ఎప్పుడో?












