Gopichand, Puri Jagannadh: యాక్షన్‌ హీరోతో సినిమాకు పూరి రెడీ.. ప్రాజెక్ట్‌ ఓకే అయిందా?

  • September 11, 2024 / 12:45 PM IST

నీకూ హిట్టు లేదు.. నాకూ హిట్టు లేదు.. ఇద్దరం కలసి సినిమా చేద్దామా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే చర్చ జరుగుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ వస్తుంది అని అంటున్నారు. గతంలో ఆ ఇద్దరూ కలసి ఓ సినిమా చేసినా.. అది అనుకున్నంత పెద్ద విజయం అందుకోలేదు. ఆ కాంబినేషనే పూరి జగన్నాథ్‌ – గోపీచంద్‌. గతంలో గోపీచంద్‌  (Gopichand ) – పూరి జగన్నాథ్‌   (Puri Jagannadh) కలసి ‘గోలీమార్‌’ (Golimaar) అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.

Gopichand, Puri Jagannadh

ఇప్పుడు వాళ్లిద్దరూ కలసి ఓ సినిమా చేసే ఆలోచనలో డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ‘గోలీమార్‌’కి సీక్వెల్‌ అని అంటున్నారు. తొలి సినిమా క్లైమాక్స్‌లోనే రెండో పార్టుకు లీడ్‌ ఇచ్చారు పూరి జగన్నాథ్‌. అయతే ఇన్నాళ్లూ దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. అటు గోపీచంద్‌కు (Gopichand) , ఇటు పూరి జగన్నాథ్‌ గత కొన్నేళ్లుగా సరైన విజయం లేదు. మొన్నీమధ్యే రామ్‌తో (Ram) ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart)  సినిమా చేసి బొక్కబోర్లా పడ్డారు.

దీంతో ఇప్పుడు పూరి నెక్స్ట్‌ మూవీ ఎవరితో అనే చర్చ జరుగుతోంది. మరోవైపు గోపీచంద్‌ ఈ ఏడాది మార్చిలో ‘భీమా’ (Bhimaa) సినిమాతో వచ్చాడు. అది బాక్సాఫీసు దగ్గర తేడా కొట్టేసింది. ఇప్పుడు ‘విశ్వం’ (Viswam)  సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఆ సినిమా ఫలితం బాగుంటే గోపీచంద్‌ (Gopichand) నెక్స్ట్‌ మూవీ నిర్ణయంలో మార్పు ఉండొచ్చు అనే టాక్‌ వినిపిస్తోంది. శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా మీద అంతగా అంచనాలు అయితే లేవు.

కానీ ఇటీవల వచ్చిన ట్రైలర్‌ కాస్త ఆసక్తికరంగా కనిపించింది. పాత శ్రీను వైట్ల మళ్లీ వచ్చారా అనేంతలా వినోదం పండించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 11న విడుదలవుతుందని టాక్‌. ఆ రోజు వచ్చే ఫలితం బట్టి పూరి జగన్నాథ్‌ నెక్స్ట్‌ సినిమా ఏదని తేలుతుంది.

బెల్లంకొండ సరసన స్టార్‌ దర్శకుడి కుమార్తె.. ఇక్కడా రాణిస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus