ప్రభాస్ సాహోలో హీరోయిన్ గా పరిశీలనలో ముగ్గురు పేర్లు
June 13, 2017 / 08:58 AM IST
|Follow Us
బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో రెగ్యులర్ షూటింగ్ మొదలయింది. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ లో హీరోయిన్ ఎవరనేది ? ఆసక్తికరంగా మారింది. మొదట్లో కన్నడ బ్యూటీ రష్మిక మందనా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే, పరిణీతి చోప్రా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా అనుష్క, పూజా హెగ్డే, మంజిమ మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. సాహసం శ్వాసగా సాగిపో మూవీతో తెలుగు ప్రజలను ఆకట్టుకున్న బ్యూటీ మంజిమ మోహన్ ప్రభాస్ పక్కన బాగుంటుందని సుజీత్ అనుకుంటున్నారు. నటన ఒకే అయినా హైట్ పరంగా చూస్తే ఇబ్బందులు వస్తాయని పూజ హెగ్డే పేరుని కూడా పరిశీలిస్తున్నారు.
వీరంతా కాకుండా ఆల్రెడీ హిట్ పెయిర్ గా పేరుతెచ్చుకున్న అనుష్కనే ఒకే చేస్తే బాగుంటుందని చిత్ర బృందంలో చర్చలు సాగుతున్నట్లు సమాచారం. పైగా అనుష్క బాహుబలి తర్వాత బాగమతి సినిమాని కంప్లీట్ చేసి ఖాళీగా ఉంది. సో డేట్స్ ఇబ్బంది ఉండదు. కాబట్టి పక్కా యాక్షన్ మూవీ అయిన సాహోలో అనుష్క సెలక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.