Rajamouli: ఆ సమయంలో డబ్బుల కోసం జక్కన్న ఇబ్బందులు పడ్డారా?

  • September 28, 2024 / 06:28 PM IST

దర్శకధీరుడు రాజమౌళి (S. S. Rajamouli)  పారితోషికం భారీ రేంజ్ లో ఉందన్న సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రాజమౌళి పారితోషికం అందుకుంటున్నారు. అయితే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు రావడానికి ముందు రాజమౌళి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో తాను లక్ష రూపాయల కోసం ఇబ్బంది పడితే రాఘవేంద్రరావు సహాయం చేశారని రాజమౌళి తెలిపారు. అక్క అమెరికాలో గర్భవతిగా ఉన్న సమయంలో అమ్మను అమెరికాకు వెళ్లి రావడానికి లక్ష రూపాయలు అవసరం అని ఆ సమయంలో రాఘవేంద్రరావు (Raghavendra Rao) గారిని లక్ష రూపాయలు అడిగానని రాజమౌళి తెలిపారు.

Rajamouli

లక్ష రూపాయలు కావాలని అడిగిన వెంటనే రాఘవేంద్రరావు ఆ డబ్బులు ఎందుకు అని కూడా అడగకుండా వెంటనే లక్ష రూపాయలు ఇచ్చేశారని జక్కన్న చెప్పుకొచ్చారు. రాఘవేంద్రరావు తన సినిమాలలో డ్రామాని అద్భుతంగా తెరకెక్కిస్తారని టేకింగ్ విషయంలో ఆయనకు తిరుగులేదని రాజమౌళి పేర్కొన్నారు. రాజమౌళి మహేష్ బాబుకు పాన్ వరల్డ్ హిట్ ఇవ్వడం పక్కా అని జక్కన్న కామెంట్లు చేశారు. రాజమౌళి మహేష్ (Mahesh Babu) సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ సినిమా నటీనటుల విషయంలో సైతం మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ 2028లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడానికి సైతం రాజమౌళి ఇష్టపడటం లేదు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఆ సీనియర్ డైరెక్టర్ అంటే స్టార్ హీరో ప్రభాస్ కు ఇంత గౌరవమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus