People Media: సెంటిమెంట్ తో ‘పీపుల్ మీడియా’ గట్టెక్కేనా..?!

  • September 5, 2024 / 02:05 PM IST

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ (People Media ) సంస్థ పై జనాల్లో ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అందుకు కారణం.. వాళ్ళు 100 సినిమాలు నిర్మించాలనే టార్గెట్ తో… నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో పలు హిట్లు కూడా వీళ్ళ ఖాతాలో పడ్డాయి. ‘గూఢచారి’ (Goodachari) ‘ఓ బేబీ‘ (Oh! Baby) ‘వెంకీ మామ’ (Venky Mama) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) ‘ధమాకా’ (Dhamaka) వంటి హిట్ సినిమాలు ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చాయి. కానీ.. అవి కొలాబరేషన్లో చేసిన సినిమాలు.

People Media

మొదట్లో ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థతో కొన్ని సినిమాలు, తర్వాత ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ తో కొన్ని సినిమాలు.. కలిసి నిర్మించాయి. సోలో నిర్మాతలుగా మాత్రం వీళ్ళు సక్సెస్..లు కొట్టిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ బ్యానర్ నుండి ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)వచ్చింది. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. త్వరలో ఇంకో రెండు సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు.

అందులో శ్రీవిష్ణు (Sree Vishnu) ‘స్వాగ్’ ఒకటి, గోపీచంద్ ‘విశ్వం’ (Viswam) ఒకటి ఉండటం గమనార్హం. ‘స్వాగ్’ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా నమ్మకం లేదు. టీజర్ చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. అయినప్పటికీ శ్రీవిష్ణు వరుస హిట్లతో ఫామ్లో ఉన్నాడు కాబట్టి.. చెప్పలేం. ఇక గోపీచంద్ (Gopichand) తో చేస్తున్న ‘విశ్వం’ టీజర్ ఈరోజు బయటకు వచ్చింది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ‘ఆగడు’ నుండి శ్రీను వైట్ల (Sreenu Vaitla)  చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.

అయినప్పటికీ ‘విశ్వం’ టీజర్ ఎందుకో కొంత బెటర్ గా కనిపిస్తుంది. పైగా ‘పీపుల్ మీడియా’ (People Media) వాళ్ళు సోలోగా కాకుండా ‘చిత్రాలయం స్టూడియోస్’ అధినేత వేణు దోనేపూడితో కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. వాళ్ళు కొలాబరేషన్లో చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. కాబట్టి.. ఇది కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

‘దేవర’ వచ్చినా ‘సరిపోదా..’ సందడి తగ్గదట.. ఎలా అంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus