తమిళ సినిమా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (Jaabilamma Neeku Antha Kopama) గత వారం అంటే ఫిబ్రవరి 21న రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అతని మేనల్లుడు పవిష్ హీరోగా నటించాడు. ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) చేసిన స్పెషల్ సాంగ్ ‘గోల్డెన్ స్పారో’ సినిమాకి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) దీనికి సంగీతం అందించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి’ సంస్థ రిలీజ్ చేసింది.
పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ అదిరిపోతాయేమో అని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగడం లేదు. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.43 cr |
సీడెడ్ | 0.16 cr |
ఆంధ్ర(టోటల్) | 0.30 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.89 cr |
‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (Jaabilamma Neeku Antha Kopama) చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.8 కోట్లు. అయితే 5 రోజుల్లో ఈ సినిమా రూ.0.89 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.0.91 కోట్ల షేర్ ను రాబట్టాలి. తెలుగులో సినిమాని సరైన విధంగా ప్రమోట్ చేసుంటే.. ఓపెనింగ్స్ కచ్చితంగా బెటర్ గా వచ్చి ఉండేవి. ఇప్పుడైతే వీకెండ్ వరకు ఓకే అనిపించిన ఈ సినిమా.. తర్వాత ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు.