Jr NTR: దెబ్బ తగిలినా ఎన్టీఆర్ షూటింగ్ ను ఆపలేదా?

  • May 1, 2022 / 02:00 PM IST

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఆది సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా బెల్లంకొండ సురేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. తారక్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి చావ్లా నటించారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా కోసం పని చేయగా పరుచూరి గోపాలకృష్ణ ఒక సందర్భంలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆది సినిమా కథను చూసి మా రెండో కూతురు నాగ సుష్మ ఈ కథ బాలయ్యకు సరిపోతుందని జూనియర్ ఎన్టీఆర్ చిన్నవారు కదా అని అన్నారని ఆ సమయంలో తాను సీనియర్ ఎన్టీఅర్ బ్లడ్ అది ఎవరు చేసినా అద్భుతంగా నటిస్తారని చెప్పానని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. ఆది మూవీలో తారక్ రాయలసీమలో మంచి నీళ్లు తాగే షాట్ ను చూస్తే వినాయక్ ఆది మూవీని ఎంత బాగా ఆలోచించి తీశాడో అర్థమవుతుందని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.

వైజాగ్ లో ఆది క్లైమాక్స్ జరిగే సమయంలో తారక్ చెయ్యి అద్దానికి తగలడంతో తారక్ కు గాయమైందని తాను షూటింగ్ ఆగిపోయిందా అని అడిగితే తారక్ చేసేస్తానని చెప్పి చేశారని వినాయక్ చెప్పాడని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ కు చేతికి గాయమైనా షూటింగ్ ఆపకుండా చేశారని తాత మొండితనం మనవడికి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఆది సినిమా చరిత్ర సృష్టించిందని ప్రెస్ మీట్ లో తారక్ తనను పెదనాన్న అని పిలిచాడని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

తారక్ తనకు ఎంతో గౌరవం ఇస్తాడని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. ఆది సినిమాలో తారక్ బాబాయ్ పాత్రలో తాను నటించి ఉంటే తనకు మరింత సంతృప్తిగా ఉండేదని ఆయన వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు తమను వేరే కుటుంబంలా చూడరని ఆయన చెప్పుకొచ్చారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus