Keerthy Suresh: లేడీ విలన్‌ను ఢీకొట్టబోతున్న స్టార్‌ హీరోయిన్‌… ఏవరా ఇద్దరు?

  • November 26, 2023 / 08:49 PM IST

సినిమాల్లో సరైన అవకాశాలు లేనప్పుడు మన సినిమా జనాలు ఓటీటీలకు వెళ్తుంటారు అని అనేవారు గతంలో. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత అంతా మారిపోయింది. ఇప్పుడు బిజీ టైమ్‌లోనే ఓటీటీ ప్రాజెక్టులు చేస్తూ మేం ఇక్కడా ఉంటాం, అక్కడా ఉంటాం అని చెబుతున్నారు. అలా స్టార్‌ హీరోలు, హీరోయిన్లు కూడా ఇప్పుడు ఈ ట్రెండ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో సౌత్‌ ఇండియా ‘మహానటి’ కీర్తి సురేశ్ కూడా ఓటీటీవైపు అడుగులేసింది.

సౌత్‌లో వరుసగా చెల్లెలు పాత్రలు చేసి అలరించిన కీర్తి సురేశ్… ఓటీటీల్లో కూడా అలాంటి స్టెప్పే వేస్తోంది. అది కూడా బాలీవుడ్‌కి చెందిన నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌లో. అక్కా చెల్లెళ్ల కథతో కీర్తి సురేశ్‌ తొలి వెబ్‌ సిరీస్ ఉండబోతోంది అని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌లో కీర్తి సురేష్‌, మరో కథానాయిక రాధికా ఆప్టే కలసి నటించబోతున్నట్లు సమాచారం.

‘‘ది రైల్వే మేన్‌’, ‘మండలా మర్డర్స్‌’ లాంటి వెబ్‌ సీరిస్‌లతో ఓటీటీలోకి అడుగుపెట్టింది యశ్‌ రాజ్‌ బాలీవుడ్‌లో ఇప్పటికే తన తడాఖా చూపిస్తోంది. ఇప్పుడు మూడో వెబ్‌ సిరీస్‌ను సిస్టర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు ఈ సిరీస్‌కు ‘అక్క’ అని పేరు పెట్టారు. ఈ సిరీస్‌లో కీర్తి, రాధిక ఫేస్‌ ఆఫ్‌ చూస్తారట. ఈ సిరీస్‌ను నూతన దర్శకుడు ధర్మరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది.

అయితే, ఈ సినిమాలో కూడా (Keerthy Suresh) కీర్తి సురేశ్‌ చెల్లిగానే కనిపిస్తుందట. అక్కడా రాధిక ఆప్టే ఉంటుందట. అక్కాచెల్లెళ్లలో రాధిక ఆప్టే పాత్ర కాస్త నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుందట. ఇలాంటి పాత్రలు రాధికకు కొట్టిన పిండే. మరి ఆమెను ముఖాముఖిలో కీర్తి సురేశ్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. తెలుగులో ఈ మధ్య కీర్తి నటించిన సినిమాలకు సరైన విజయాలు రాలేదు. అయినా కెరీర్‌ జోరు మీదనే ఉంది. ప్రస్తుతం కీర్తి సురేశ్‌ ‘సైరన్‌’, ‘రివాల్వర్‌ రీటా’ సినిమాల చిత్రీకరణలో ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus