మ్యాచోస్టార్ గోపీచంద్ విడుదల చేసిన ‘కోటేశ్వరరావు గారి కొడుకులు’ టీజర్

  • December 10, 2021 / 07:48 PM IST

అభినవ్, సత్యమణి హీరోలుగా ప్రియాంక డి, చందన కృష్ణ హీరోయిన్లుగా వశిష్ట్ నారాయణ ప్రధాన పాత్రలో ‘మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్’ పతాకం పై నవీన్ ఇరగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తన్వీర్ యం.డి. నిర్మిస్తున్న చిత్రం ‘కోటేశ్వరరావు గారి కొడుకులు’ (మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ) అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండీ మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను మ్యాచో స్టార్ గోపీచంద్ చేతులు మీదుగా విడుదల చేసారు. టీజర్ వీక్షించిన గోపీచంద్…’కోటేశ్వరరావు గారి కొడుకులు’ టీజర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది.

అలాగే టీజర్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉంది, ఇందులో కంటెంట్ కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అంటూ చెప్పి చిత్ర యూనిట్ సభ్యులకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఇక టీజర్ విషయానికి వస్తే.. ‘మనకి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా దానికి కారణం కచ్చితంగా మనీ అయ్యుంటుంది. మనీ కెన్ డూ ఎనీథింగ్ మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ మనీ’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. సస్పెన్స్ ఎలిమెంట్స్, రొమాంటిక్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ ను కట్ చేయడం జరిగింది.

‘ఈ మధ్య పొలిటీషియన్స్ కన్నా ప్రజలే ఎక్కువ రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఎవడికీ అర్ధం కావడం లేదు’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus