Krishna Vamsi : కృష్ణ వంశీ మరో కొత్త ప్లాన్‌.. ఎంతవరకు సాధ్యం!

  • August 26, 2022 / 11:54 AM IST

పాన్‌ ఇండియా సినిమా.. ఇప్పుడు సినిమా అభిమానుల్లో ఎక్కువగా వినిపిస్తోన్న చర్చ ఇదీ. గతంలో ద్విభాషా చిత్రం మాది అంటూ గొప్పలు చెప్పుకునే సినిమాలు చూసి ఉంటారు. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమా మాది అని చెప్పుకుంటున్నారు. అయితే పాన్‌ ఇండియా సినిమా అంటే ఓ స్టార్‌ హీరో అందులోనూ మాస్‌ ఇమేజ్‌ ఉన్న స్టార్‌ కనిపిస్తాడు. కానీ స్టార్‌ హీరోయిన్లతో పాన్‌ ఇండియా సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ.

అవును, మీరు చదివింది కరెక్టే. కృష్ణవంశీ తాజాగా ఓ కొత్త సినిమా ఆలోచన చేస్తున్నారు. ‘రంగ మార్తాండ’ సినిమాను విడుదలకు సిద్ధం చేసే పనిలో ఉన్న కృష్ణవంశీ.. ఆ తర్వాతి సినిమాల జాబితాలో ఓ పాన్‌ ఇండియా సినిమాను చేర్చారట. అందులోనూ అది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అని అంటున్నారు. అందులో పాన్‌ ఇండియా ఇమేజ్‌ ఉన్న కథానాయికలు పూజా హెగ్డే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను తీసుకుంటారని సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ దఫా చర్చలు సాగాయని కూడా అంటున్నారు.

‘రంగమార్తాండ’ సినిమా తర్వాత కృష్ణవంశీ ‘అన్నం’ అనే సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా పోస్టర్‌ను, మోషన్‌ పోస్టర్‌ను కూడా గతంలో విడుదల చేశారు. ఫుడ్ మాఫియా నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం కూడా ఉంది. ఆ సినిమా సంగతులు ఏవైనా వస్తాయేమో అని చూస్తుంటే.. కొత్తగా పాన్‌ ఇండియా సినిమా అంటూ సమాచారం బయటకు వచ్చింది. ఈ కథ ఆలోచన కృష్ణవంశీకి ఎప్పటి నుండో ఉందట. ఇటీవలే దాన్ని ప్రాజెక్ట్‌గా సిద్ధం చేసే పనులు ఓ కొలిక్కి తీసుకొచ్చారట.

ఇక ఈ సినిమా అవకాశం ఉందా అని అంఏ.. ప్రస్తుతం రకుల్‌ బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తోంది. పూజ అయితే అక్కడా, ఇక్కడా అన్ని రకాల సినిమాలూ చేస్తోంది. పాన్‌ ఇండియా, అందులోనూ ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ అంటే ఈ భామలు ఓకే చెబుతారనే అనిపిస్తోంది. మరి కృష్ణవంశీ ఈ సినిమాను ఎంతవరకు మెటీరియలైజ్ చేస్తారు అనేది చూడాలి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus