Krithi Shetty: స్వయంగా కృతి శెట్టి.. రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చేసింది..!

  • May 19, 2021 / 07:04 PM IST

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ అయిన ‘ఉప్పెన’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది కృతి శెట్టి. నిజానికి ఈ సినిమా విడుదల కాకముందే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడైతే ‘ఉప్పెన’ నుండీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యిందో.. అప్పటి నుండీ కృతి శెట్టి పై ఆడియెన్స్ ఫోకస్ పడింది.ముఖ్యంగా తన క్యూట్ లుక్స్ తో కుర్రకారుని బాగా ఆకర్షించింది అనే చెప్పాలి.

ఇక ‘ఉప్పెన’ విడుదలవ్వడం.. పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగిన తర్వాత ఈమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. వెంటనే పారితోషికం కూడా పెంచేసింది అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఒకవేళ పారితోషికం తక్కువైతే ఏ ప్రాజెక్టులను కృతి ఒప్పుకోవడం లేదని కూడా గుసగుసలు వినిపించాయి. ఇక కొద్ది రోజుల నుండీ ఈమె పెద్ద పెద్ద ప్రాజెక్టులు లైన్లో పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయాల పై స్పందించి అలాంటి రూమర్లకు చెక్ పెట్టింది కృతి శెట్టి.

తన ట్విట్టర్ ద్వారా ఈ విషయం పై కృతి స్పందిస్తూ.. “నేను తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి చాలా రూమర్లు వినబడుతున్నాయి. ప్రస్తుతం నేను మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాను. అందులో ఒకటి నాని గారి సినిమా, మరొకటి సుధీర్‌ బాబు సినిమా, అలాగే రామ్‌ గారి సినిమా. ప్రస్తుతం ఈ 3 ప్రాజెక్టుల పైనే నా ఫోకస్ ఉంది. ఒకవేళ నేను మరో ప్రాజెక్ట్ కి కనుక కమిట్ అయితే.. నేనే అనౌన్స్ చేస్తాను” అంటూ పేర్కొంది.


Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus