‘భీష్మ’ కు ఆ విషయంలో చాలా ప్లస్ అయ్యేలా ఉంది..!

  • February 7, 2020 / 06:04 PM IST

నితిన్ నటించిన గత మూడు సినిమాలు పెద్ద డిజాస్టర్లు అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇప్పుడు తన సినిమాని కొనడానికి బయ్యర్స్ ఎగపడుతున్నారనేది తాజా సమాచారం. ‘అదేంటి.. సాధారణంగా ఒక్క డిజాస్టర్ పడితేనే.. ఆ హీరోగారి తర్వాతి చిత్రాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రారు… అలాంటిది మూడు డిజాస్టర్ లు పడినా సినిమా కొనడానికి ముందుకు రావడం వెనుక అసలు కారణం ఏంటి?’ అని ఆలోచిస్తున్నారా…! దానికి కారణం మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలే అని తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే.. 2020 సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ అలాగే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఎంత పెద్ద విజయాల్ని నమోదు చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అల వైకుంఠపురములో’ నిర్మాతలే నితిన్ ‘భీష్మ’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవును ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ పేరెంట్ బ్యానర్ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి ‘అల వైకుంఠపురములో’ బయ్యర్స్ అంతా ‘భీష్మ’ కోసం ఎగబడుతున్నారట. అంతేకాదు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక కూడా ఈ చిత్రంలో హీరోయిన్ కాబట్టి.. ఆ విధంగా కూడా ‘భీష్మ’ కు ప్లస్ అయ్యిందని తెలుస్తుంది. ఇక విడుదల చేసిన టీజర్, రెండు పాటలకి కూడా మంచి స్పందన లభించడంతో ఈ చిత్రం పై అంచనాలు కూడా పెరిగాయి.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus