Mahesh Babu: తల్లి చివరి కోరికను తీర్చలేదని మహేష్ బాబు కుమిలిపోతున్నారా?

  • October 1, 2022 / 02:04 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణ వార్త మహేష్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను ఎంతగానో బాధపెట్టింది. ఏడు పదుల వయస్సులో అనారోగ్య సమస్యల వల్ల ఇందిరా దేవి మృతి చెందారు. అయితే తల్లి చనిపోయిన తర్వాత తల్లి చివరి కోరికను నెరవేర్చలేకపోయానని మహేష్ బాబు చాలా బాధ పడుతున్నారని సమాచారం అందుతోంది. సితార ఓణీల ఫంక్షన్ చూడాలని ఇందిరా దేవి మహేష్ ను కోరారని సమాచారం.

అయితే మహేష్ వర్క్ విషయంలో బిజీగా ఉండటంతో అమ్మ మాటను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇందిరా దేవి బ్రతికి ఉన్న సమయంలోనే ఈ వేడుకను జరిపించి ఉంటే బాగుండేదని మహేష్ ప్రస్తుతం ఫీలవుతున్నారని బోగట్టా. ఇందిరా దేవి, సితార ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారని నాన్నమ్మకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సితార చూసుకునేవారని సమాచారం. మహేష్ కెరీర్ లో ఈ స్థాయిలో సక్సెస్ సాధించడానికి ఇందిరాదేవి కూడా ఒక విధంగా కారణమని చెప్పవచ్చు.

తల్లి అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉండటం వల్లే మహేష్ సర్కారు వారి పాట సినిమా రిలీజైన తర్వాత తల్లి పక్కన ఉంటూ ఆమె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. మహేష్ బాబు తల్లి మరణం తర్వాత ఎక్కువ సమయం ఒంటరిగా ఉంటున్నారని బోగట్టా. మహేష్ తాత్కాలికంగా త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ను సైతం పోస్ట్ పోన్ చేశారని తెలుస్తోంది. యాక్షన్ సీన్ తో ఈ సినిమా షూట్ మొదలైంది.

సితార కూడా నాన్నమ్మతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారని తెలుస్తోంది. కృష్ణ కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూ ఉండటం ఫ్యాన్స్ ను సైతం బాధ పెడుతోంది. మహేష్ త్రివిక్రమ్ సినిమా పూర్తైన తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటించనున్నారు. ఈ రెండు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus