అప్పుడు.. ఇప్పుడు.. నందమూరి, అక్కినేని, ఘట్టమనేని త్రయం.. వైరల్ అవుతున్న వారసుల పిక్..!

  • November 15, 2022 / 07:26 PM IST

కొన్ని కొన్ని సందర్భాల్లో మాటలు అవసరం లేకుండా మనసులోని జ్ణాపకాలు, మధురమైన క్షణాలే మాట్లాడుతుంటాయి.. నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15న మరణించిన విషయం తెలిసిందే. కడసారి చూసి నివాళులర్పించేందుకు సినీ రంగమంతా ఆయన నివాసానికి బారులు తీరింది.. వయసుతో సంబంధం లేకుండా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేసి కృష్ణ గారి పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు మహేష్ బాబుకి ధైర్యం చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య కూడా వచ్చారు.. మహేష్, తారక్ మధ్య ఉండే సన్నిహిాతం గురించి చెప్పక్కర్లేదు..ఈ సందర్భంగా మహేష్ బాబుని ఓదారుస్తూ పక్కనే కూర్చున్నారు తారక్, చై.. ఆ ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. తెలుగు సినీ చరిత్రలో నందమూరి, అక్కినేని, ఘట్టమనేని త్రయం అయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ గార్లు ఎంతో సన్నిహితంగా ఉండేవారు.. ఆ మూడు వంశాలకు చెందిన వారసులు..

రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ గారి మనవడు నాగ చైతన్య, కృష్ణ గారి రెండో వారసుడు మహేష్ బాబు.. వీళ్ల ముగ్గుర్నీ ఒకే ఫ్రేములో చూసి అభిమానులు సంతోషపడుతున్నారు.. ‘తరాలు మారాయి కానీ మీ మధ్య అనుంబంధం మరింత బలపడింది’ అని కామెంట్స్ చేస్తే.. నందమూరి, అక్కినేని, ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాతో పాటు, ఫ్యాన్ పేజీల్లో బాగా వైరల్ చేస్తున్నారు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus