Mahesh Babu: కష్టాల్లో ఉన్న ఫ్యాన్ కుటుంబానికి అండగా నిలబడ్డ మహేష్.. ఏం చేశారంటే?

  • June 19, 2024 / 07:43 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఎన్నో హార్ట్ సర్జరీలు చేయించి వేల సంఖ్యలో చిన్నారుల కుటుంబాల్లో వెలుగులు నింపి మంచి మనస్సును చాటుకున్న సంగతి తెలిసిందే. వివాదాలకు దూరంగా ఉంటూ అందరు హీరోలతో స్నేహపూర్వకంగా మెలిగే హీరోగా మహేష్ బాబుకు పేరుంది. ఇతర హీరోల అభిమానులు సైతం మహేష్ బాబు విషయంలో ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటారు. వయస్సు పెరుగుతున్నా యంగ్ గా కనిపించే మహేష్ బాబు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో మంచి మనస్సును చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న రాజేశ్ అనే అభిమాని పిల్లలను తాను చదివిస్తానని మహేష్ బాబు హామీ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణా జిల్లాలోని పెదప్రోలు గ్రామం ప్రశాంత్ నగర్ కు చెందిన కాకర్లమూడి రాజేశ్ గతంలో కృష్ణను (Krishna) , ఆ తర్వాత మహేష్ బాబును ఎంతో అభిమానించారు. రాజేశ్ తన పిల్లలకు మహేష్ బాబు సినిమా పేర్లైన “అర్జున్” (Arjun) , “అతిథి” (Athidi) , “ఆగడు” (Aagadu) పేర్లను పెట్టుకున్నారు.

కిడ్నీ పాడై రాజేశ్ మంచానికే పరిమితం కావడంతో అతని కొడుకు అర్జున్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. మహేష్ ను చూడాలని కనీసం ఆయనతో మాట్లాడాలని రాజేష్ కోరిక కాగా ఈ విషయం తన దృష్టికి రావడంతో మహేష్ బాబు తన బృందం ద్వారా రాజేష్ ఫ్యామిలీకి అండగా నిలిచారు.

రాజేష్ పిల్లల్లో ఇద్దరినీ స్కూల్ లో చేర్పించడంతో పాటు వాళ్ల చదువుకు అవసరమైన మొత్తాన్ని తానే చెల్లిస్తానని మహేష్ బాబు హామీ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మహేష్ బాబు మనిషి రూపంలో ఉన్న దేవుడంటూ కామెంట్లు చేస్తున్నారు. సంపాదించిన మొత్తాన్ని కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ మహేష్ బాబు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus