Manam Collections: 10 ఏళ్ళ ‘మనం’.. ఫైనల్ గా కలెక్ట్ చేసింది ఎంతో తెలుసా?

  • May 23, 2024 / 05:12 PM IST

‘మనం’ (Manam) చిత్రాన్ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు.కేవలం ఇది క్లాసిక్ అంటే సరిపోదు. ఇది మంచి ఎక్స్పీరియన్స్ కూడా..! ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై అక్కినేని నాగార్జున (Nagarjuna)  నిర్మించిన ఈ చిత్రాన్ని విక్రమ్ కె కుమార్ (Vikram kumar) డైరెక్ట్ చేశాడు. అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)  , దివంగత అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao)  కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో అఖిల్ (Akhil)  , అమల (Amala) కూడా గెస్ట్ రోల్స్ చేశారు. శ్రీయ (Shriya Saran ) ,సమంత  (Samantha Ruth Prabhu).. హీరోయిన్లు. అక్కినేని నాగేశ్వర రావు చివరి చిత్రంగా ‘మనం’ రిలీజ్ అయ్యింది.

‘ఆయన ఇక లేరు’ అనే ఆలోచనల్ని ఈ సినిమా దూరం చేసింది అని అక్కినేని అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు. ఈ సినిమా చూస్తుంటే నిజంగా అందరికీ అదే ఫీలింగ్ కలుగుతుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. 2014 మే 23న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నేటితో ‘మనం’ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద మనం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :

నైజాం 11.20 cr
సీడెడ్ 3.90 cr
ఉత్తరాంధ్ర 3.30 cr
ఈస్ట్  2.10 cr
వెస్ట్  1.50 cr
గుంటూరు  2.25 cr
కృష్ణా  2.00 cr
నెల్లూరు  1.00 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  27.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   3.00 cr
ఓవర్సీస్  6.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 36.65 cr

‘మనం’ చిత్రం రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఆ టార్గెట్ ను మొదటి వారమే రీచ్ అయిన ఈ సినిమా ఫైనల్ గా రూ.36.65 కోట్ల షేర్ ను రాబట్టి.. డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus