రైతుల కోసం అందరినీ ఏకం చేస్తున్న మంచు మనోజ్!
- May 24, 2017 / 09:36 AM ISTByFilmy Focus
మన దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా.. అందరికీ అన్నం పెట్టే రైతన్న కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రతి రోజూ దేశంలో ఏదో ప్రాంతంలో రైతు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త అందరినీ కలిచి వేస్తోంది. ప్రభుత్వాలు సంక్షేమ చర్యలు చేపడుతున్నా.. అవి వారి జీవితాలను మార్చలేకపోతున్నాయి. అందుకే తమవంతు సాయం అందించాలని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నిర్ణయించుకున్నారు. మనకు అన్నం పెట్టే రైతులకు అన్నం పెట్టే బాధ్యతను తీసుకున్నారు. ముందు అడుగు వేసి సామాజిక సేవా దృక్పథం ఉన్న వారందరినీ ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ మంచి ఆశయానికి రాజమౌళి, రానా, కేటీఆర్, సాయి ధరమ్ తేజ్, జీవీ కేశవ్ వంటి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు చేతులు కలిపారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ తమ సంవత్సర జీతంలో, ఆదాయంలో ఒకరోజు జీతాన్ని, ఆదాయాన్ని రైతుల కోసం డొనేట్ చేయాలని ‘సేవ్ ఫార్మర్స్’ విధానానికి పిలుపునిస్తున్నారు. ఈ పిలుపుకు అందరూ స్పందించి, సాయం అందించి రైతుల కష్టాలు తొలిగి పోవాలని కోరుకుందాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














