Chiranjeevi: ఆరోజు మాత్రం చిరు నేలపైనే పడుకుంటారట.. రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Advertisement

మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. చిరంజీవి వయస్సు ప్రస్తుతం 69 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఈ వయస్సులో కూడా చిరంజీవి సినిమాల కోసం పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. చిరంజీవి విశ్వంభర (Vishwambhara) మూవీ సంక్రాంతి కానుకగానే విడుదల కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సమ్మర్ కు రిలీజ్ కావాల్సిన హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడితే ఆ సమయానికి విశ్వంభర మూవీ థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది.

Chiranjeevi

అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి మేకర్స్ నుంచి మాత్రం పూర్తిస్థాయిలో స్పష్టత అయితే లేదని చెప్పవచ్చు. 2025 సంక్రాంతి పండుగకు ఎంతో సమయం లేదు. మేకర్స్ త్వరగా ఇందుకు సంబంధించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిరంజీవి ఏవైనా సినిమా ఈవెంట్లు, సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగిన రోజున ఇంటికి వెళ్లి నేలపైనే పడుకుంటారని తెలుస్తోంది.

ఫ్యాన్స్ ప్రేమను నేను గుండెల్లో దాచుకుంటానే తప్ప తలకెక్కించుకోనని ఆయన అన్నారు. అందుకే ఈవెంట్లు పూర్తైన రోజున నేలపైనే పడుకుంటానని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం. ఒక సినిమా ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి తన సినిమాల కోసం ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. భవిష్యత్తు సినిమాలతో చిరంజీవి ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని విశ్వంభర పాన్ ఇండియా రేంజ్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

‘సత్యం సుందరం’ 13 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news