ప్రియదర్శి హీరోగా నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘మిత్రమండలి’. ప్రసాద్ బెహరా, విష్ణు ఓఐ, రాగ్ మయూర్ వంటి వారు కీలక పాత్రలు పోషించగా కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ వంటి స్టార్స్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే వీటీవీ గణేష్, దర్శకుడు అనుదీప్ కేవీ వంటి వాళ్ళు కూడా స్పెషల్ రోల్స్ చేశారు. బన్నీ వాస్ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు.
దీపావళి రేసులో అక్టోబర్ 16న(నిన్న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ప్రీమియర్స్ కూడా వేశారు. కచ్చితంగా సిక్స్ కొడతాం అని బన్నీ వాస్ కాన్ఫిడెంట్ గా చెప్పారు. కానీ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఫస్ట్ డే ఓపెనింగ్స్ నిరాశపరిచాయి.
ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.08 cr |
సీడెడ్ | 0.02 cr |
ఆంధ్ర(టోటల్) | 0.06 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.16 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.03 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 0.19 కోట్లు(షేర్) |
‘మిత్రమండలి’ చిత్రానికి రూ.5.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి కేవలం రూ.0.19 కోట్లు షేర్(ప్రీమియర్స్ తో కలుపుకుని) వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.81 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.