Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ
- May 13, 2026 / 08:09 PM ISTByPhani Kumar
నిన్న అంటే మే 12న దిల్ సోదరుడు శిరీష్ తో పాటు ఏషియన్ సునీల్ నారంగ్ అలాగే కొందరు ఎగ్జిబిటర్లు కలిసి ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Naga Vamsi
పర్సెంటేజీ విధానం ప్రవేశపెట్టకపోతే సింగిల్ స్క్రీన్స్ నడపలేమని.. ఇందుకు సహకరిస్తేనే థియేటర్లు నడపగలం అని.. ఆల్రెడీ శ్రీరాములు వంటి థియేటర్లు మూసేశామని వారు తెలిపారు.

దానికి కౌంటర్ గా ఈరోజు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా ఓ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో ‘మైత్రి’ రవి, ‘సితార’ నాగవంశీ, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి వంటి వారు పాల్గొన్నారు.
ఈ క్రమంలో నాగవంశీ(Naga Vamsi) ఓ ఎగ్జిబిటర్ కమ్ నిర్మాత పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. “సుమారు 300కి పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్లు నిర్వహిస్తూ, వ్యాపారాన్ని విస్తరిస్తున్న ఒక పెద్ద ఎగ్జిబిటర్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని ఆవేదన చెందడం వినడానికి వింతగా నవ్వొచ్చే విధంగా ఉంది. ఏ సెంటర్ నుంచి సి సెంటర్ దాకా దొరికిన ప్రతి ఖాళీ స్థలంలోనూ మల్టీప్లెక్స్లు కట్టేస్తూ, సింగిల్ స్క్రీన్లకు వెళ్లాల్సిన ఆదాయాన్ని తమ ఖాతాలోకి మళ్లించుకుంటున్నప్పటికీ సింగిల్ స్క్రీన్స్ కష్టాల గురించి మాట్లాడటం ‘దొంగే… దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది’ ” అంటూ నాగవంశీ తెలిపారు.

నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ఏషియన్ సునీల్ నారంగ్ గురించే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఇప్పటికే చాలా సింగిల్ స్క్రీన్స్ ని మల్టీప్లెక్సులుగా మార్చేశారు. మహేష్ బాబు పేరు చెప్పి ‘ఏ ఎం బి’, రవితేజ పేరు చెప్పి ‘ఏ ఆర్ టి’, అల్లు అర్జున్ పేరు చెప్పి ‘ఎ ఎ ఎ’.. ఇలా చెప్పుకుంటూ పోతే రాంచరణ్ వంటి హీరోలతో కూడా టై అప్ అయ్యి మల్టిప్లెక్స్ బిజినెస్ ను విస్తరిస్తున్నారు. అలాంటి వ్యక్తి వచ్చి సింగిల్ స్క్రీన్స్ కష్టాలు అంటూ మాట్లాడటాన్ని నాగవంశీ తప్పుబట్టారు. వాస్తవానికి అది లాజిక్ కూడా..!
అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు
300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ#NagaVamsi #SunielNarang #Tollywood pic.twitter.com/12MejA2Nmy
— Phani Kumar (@phanikumar2809) May 13, 2026
















