Nagarjuna: నాగార్జునను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్.. ఆ డబ్బులు కట్టించాలంటూ?

  • August 27, 2024 / 01:23 PM IST

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఏదైనా చిన్న తప్పు చేసి దొరికిపోయే మీడియా, సోషల్ మీడియా వాళ్లను టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. నాగార్జున  (Nagarjuna) ఎన్ కన్వెన్షన్ వివాదం విషయంలో తప్పు చేశారో లేదో తెలీదు కానీ ఆయన మాత్రం చాలామందికి టార్గెట్ అయ్యారు. తన భూమి పట్టా భూమి అని నాగ్ చెబుతున్నా చాలామంది నాగార్జున మాటలను మాత్రం నమ్మడం లేదు.

Nagarjuna

ఎన్ కన్వెన్షన్ ను కూల్చడం ద్వారా నాగార్జునకు భారీ మొత్తంలో నష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి అసలు నిజాల కంటే ఊహాగానాలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయని నాగ్ చెబుతున్నారు. పట్టా భూమిలోనే కన్వెన్షన్ ను నిర్మించామని ఒక్క సెంట్ కూడా ఆక్రమించలేదని గతంలోనే స్పెషల్ కోర్టు ఇందుకు సంబంధించి తీర్పు ఇచ్చిందని నాగ్ చెప్పుకొచ్చారు.

నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కొరకు హైకోర్టును ఆశ్రయించానని న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటానని అవాస్తవాలను నమ్మవద్దని నాగ్ పేర్కొన్నారు. అయితే నాగార్జున ఎన్నిసార్లు వివరణలు ఇచ్చినా వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. నాగార్జున పదేళ్ల పాటు అక్రమ నిర్మాణం ద్వారా వ్యాపారం చేశారని పరిహారం కట్టించాలంటూ కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాగార్జునను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ కొనసాగుతున్నాయి. నాగార్జున ఎంత చెప్పినా అర్థం కాదా అని నాగ్ ఫ్యాన్స్ విమర్శలు చేసేవాళ్లపై ఫైర్ అవుతున్నారు. కనీసం కోర్టు నుంచి తీర్పు వెలువడే వరకు అయినా సంయమనం పాటించాలని నాగ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి మలుపులు చోటు చేసుకోనున్నాయో చూడాల్సి ఉంది. ఇన్నేళ్ల నాగార్జున కెరీర్ లో ఎప్పుడూ వినిపించని విధంగా ఇప్పుడే టార్గెట్ చేస్తూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జరుగుతున్న ప్రచారం విషయంలో నాగ్ సైతం ఫీలవుతున్నారని తెలుస్తోంది.

దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus