చరణ్, తారక్, ప్రభాస్, మహేష్ టాలీవుడ్ హీరోయిన్లకు షాకిస్తున్నారా?

  • December 22, 2022 / 01:54 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. ఈ సినిమాలలో తెలుగు హీరోయిన్ల కంటే బాలీవుడ్ హీరోయిన్లను ఎంపిక చేయడానికే హీరోలు, దర్శకనిర్మాతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇకపై టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లు సైతం టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటించడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇప్పటికే వినయ విధేయ రామ మూవీతో చరణ్ కియారా అద్వానీ జోడీ గుర్తింపును సంపాదించుకోగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ అయిన జాన్వీ ఈ సినిమాలో నటించి సక్సెస్ సాధిస్తే మరిన్ని సౌత్ సినిమాలలో నటించాలని భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ కు ఉన్న క్రేజ్ కూడా ఆమెకు ఉపయోగపడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీలో కూడా బాలీవుడ్ హీరోయిన్ నటిస్తారని సమాచారం. త్వరలో ఈ సినిమాలో మహేష్ కు జోడీగా నటించే లక్కీ బ్యూటీ ఎవరో తెలిసే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ హీరోయిన్లపై దృష్టి పెట్టడం టాలీవుడ్ హీరోయిన్లకు భారీ షాక్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయలకు చేరిన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ప్రాధాన్యత తగ్గిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus