చోటా.కె.నాయుడు తమ్ముడు పై మరో కేసు..!

  • June 30, 2020 / 12:22 PM IST

పూరి జగన్నాథ్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించే శ్యామ్.కె.నాయుడు అందరికీ సుపరిచితమే. స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా.కె. నాయుడు కి శ్యామ్.. స్వయానా తమ్ముడు కూడా.! ఇక శ్యామ్ పై కొద్దిరోజుల క్రితం నటి సాయి సుధ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ‘నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసాడు. నన్ను శారీరకంగా కూడా వాడుకుని వదిలేసాడు’ అంటూ ఆమె ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ‘తనకి న్యాయం జరిగేంతవరకూ ఎంత దూరమైనా వెళ్తానంటూ’ ఆమె ఛాలెంజ్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఈమె కేసుని స్వీకరించి.. పోలీసులు శ్యామ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. కానీ అరెస్ట్ చేసిన రెండు రోజులకే బెయిల్ పై బయటకు వచ్చేశాడు శ్యామ్. తరువాత సాయి సుధా కూడా కాంప్రమైజ్ అయిపోయింది అని అంతా అనుకున్నారు. ‘సాయిసుధాతో కాంప్రమైజ్ అయిపోయినట్టుగా కూడా కోర్టులో శ్యామ్ పిటిషన్ వేయడంతో.. నిజంగానే ఆమె కాంప్రమైజ్ అయిపోయింది అని ఫిక్స్ అంతా అయిపోయారు. కానీ ఆ కేసు విషయంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది.

దాంతో శ్యామ్ ‌పై మరో కేసు కూడా నమోదైంది. విషయం ఏమిటంటే.. సాయిసుధ కాంప్రమైజ్ అయినట్టు శ్యామ్ సబ్మిట్ చేసిన పిటిషన్లో సాయి సుధా సంతకాన్ని ఫోర్జరీ చేయించాడని తేలింది. ఈ విషయాన్ని సాయి సుధా కూడా కోర్టుకు తెలిపింది. ఈ కారణంగా శ్యామ్ బెయిల్‌ను కూడా నాంపల్లి కోర్టు రద్దు చేస్తూ.. అతని పై ఫోర్జరీ కేసుని కూడా నమోదుచేసింది.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus