Nithiin: మరోసారి తనపై తనే సెటైర్లు వేసుకున్న నితిన్!

  • March 24, 2023 / 11:42 AM IST

నితిన్ హీరోగా ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్నట్లు చాలా కాలం నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ డిలే అవ్వడంతో ఈ ప్రాజెక్టు ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.. అది కూడా ఓ కొత్త ఫార్మాట్లో.. ! మైత్రి వారి ప్రమోషనల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఈ ప్రాజెక్టుని అనౌన్స్మెంట్ తోనే రచ్చ చేయడానికి రెడీ అయ్యారు ఆ బడా నిర్మాతలు. అందుకే ఎవరి మనోభావాలు మేము దెబ్బ తీయడం లేదు.. మా మనోభావాలు మేమే దెబ్బ తీసుకుంటున్నాం.. అంటూ ఓ వీడియోను వదిలారు. ముందుగా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న నితిన్.. వెంకీ కుడుముల ఆఫీస్ కు వచ్చినట్టు అక్కడ హీరోయిన్ గా రష్మిక మందన ఉన్నట్టు చూపించారు. ‘ఈ సినిమాలో కూడా సేమ్ హీరోయినా?’ అంటూ నితిన్ అనడం ఆ తర్వాత రష్మిక రావడం..

‘మా డైరెక్టర్ ఓం రాసే ముందు కూడా నీ పేరే రాస్తాడు’ అంటూ వెంకీ ఓ పంచ్ వేయడం జరిగింది. అటు తర్వాత ‘మీరు ఎవ్వరూ లేరు కదా అని ఇప్పటివరకు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాను. ‘నేను ట్వీట్లు వేస్తే కాంట్రావర్సీ అవుతుంది’ అంటూ రష్మిక అనడం అటు తర్వాత నితిన్…

‘ఇది ఇంకా బెటర్.. నేను ఒక హిట్ ఇస్తే తర్వాత 3 ప్లాపులు వస్తున్నాయి’ అంటూ అనడం ఫన్నీగా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. దాని గురించి కూడా ఫన్నీగా ఈ వీడియోలో చెప్పారు. మీరు కూడా ఓ లుక్కేయండి :

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus