రెండో షెడ్యూల్ మొదలెట్టిన రామ్ చరణ్, ఎన్టీఆర్
- May 10, 2017 / 06:22 AM ISTByFilmy Focus
ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఒకరికి మించి ఒకరు బాడీని శిల్పంలా మలిచి అభిమానులను అలరించారు. ఇప్పుడు ఇద్దరూ వినూత్న కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ సినిమా మూడో షెడ్యూల్ నిన్న మొదలయింది. ఎన్టీఆర్ కి ఇది రెండో షెడ్యూల్ మాత్రమే. మొదటి షెడ్యూల్ ని ఎన్టీఆర్ లేకుండా డైరక్టర్ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ బంగ్లా సెట్ లో చిత్రీకరణ షురూ చేశారు. రామ్ చరణ్ తేజ్ కూడా వేగంగా దూసుకుపోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. రేపల్లె అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ చిత్రం గత నెలలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
రాజమండ్రి, కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ 24 వరకు జరిగిన షెడ్యూల్లో రామ్ చరణ్, సమంత, అనసూయలపై కొన్ని సీన్లు షూట్ చేశారు. పదిహేనురోజుల గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ మొదలెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇలా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎండలను సైతం లెక్కచేయకుండా సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ స్పీడ్ చూస్తుంటే వీరి సినిమాల మధ్య వార్ తప్పనిసరి అయ్యేలా ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















