జై లవకుశ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్ర బృందం!
- May 15, 2017 / 08:17 AM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ పక్కన ఢిల్లీ భామ రాశీ ఖన్నా, నివేత థామస్, నందితరాజ్ నటిస్తున్నారు. ఐటెం భామ హంసానందిని గెస్ట్ రోల్ పోషిస్తున్న ఈ మూవీని బాబీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ని ఈనెల 19 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఈరోజు చిత్ర బృదం అధికారికంగా ప్రకటించింది. మే 20 న తారక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు ఫస్ట్ లుక్ ని నిర్మాత కళ్యాణ్ రామ్ గిఫ్ట్ గా ఇస్తున్నారు.
ఈ ఫస్ట్ లుక్ లో మూడు పాత్రలు రివీల్ అవుతాయా? ఒక క్యారక్టర్ లుక్ మాత్రమే ఉంటుందా? అనేది సస్పెన్స్ గా మారింది. అంతేకాదు లుక్ రిలీజ్ టైమ్ ని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం కోసం బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్, హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ తదితరులు శ్రమిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















