Ashwini Dutt: ప్రొడ్యూసర్ అశ్విని దత్తుకు గౌరవమైన సత్కారం!

  • August 30, 2022 / 06:05 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఓ రాజకీయ నాయకుడిగా తెలుగు రాష్ట్రంలో అంతే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి నటుడు నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన ఓవైపు రాజకీయాలలో మరోవైపు సినిమా రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా గొప్ప నటుడిగా రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ గత మే 28న శత జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో భాగంగా స్థానిక తెనాలి పట్టణం ఎన్విఆర్ కళ్యాణ మండపంలో నందమూరి తారక రామారావు వారసుడిగా ఎమ్మెల్యే బాలకృష్ణ సారధ్యంలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే ఈ అవార్డు వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ శతాబ్ద చలనచిత్ర అవార్డును ప్రముఖ సినీ నిర్మాత శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ గారికి అందించారు. ఈ క్రమంలోనే ఆయనను వేదికపై ఎంతో గౌరవప్రదంగా సత్కరించి, ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న చేతుల మీదగా ఈ అవార్డును నిర్మాత అశ్విని దత్ కి అందించారు.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను 2022 మే 28వ తేదీ నుంచి 2023 మే 28వ తేదీ వరకు 365 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ శత జయంతి వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ శతాబ్ద చలనచిత్ర అవార్డులను అందజేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus