నా పర్సనల్ మ్యాటర్స్ మీకు ఎందుకు?

యాంకర్ రష్మీ బుల్లితెర పై ఎంత ఫేమస్ అయ్యిందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో కూడా అదే ఫామ్ ను కొనసాగించాలి అనుకుంది కానీ కథా ప్రాధాన్యత ఉన్న సినిమాల్ని కాకుండా గ్లామర్ వలుకబోసె పాత్రలనే చెయ్యడం… అవి కూడా ప్లాపులవ్వడంతో ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. తరువాత ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. దీంతో కేవలం టీవీ షోలకు మాత్రమే యాంకరింగ్ చేస్తూ బిజీగా గడుపుతుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె ఎంతో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.

సోషల్ మీడియాలో సామజిక అంశాల పై స్పందిస్తూ ఉంటుంది. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల కొన్ని మూగ జీవాలకు ఆహారాన్ని పెడుతుంది రష్మీ. ఇదిలా ఉండగా… ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. అభిమానులతో ముచ్చట్లు పెడుతూ వచ్చిన రష్మీ… తాజాగా మరోసారి అభిమానులతో ముచ్చటించింది. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే తన స్నేహితులను కలుసుకోవడానికి వెళ్తాను అని చెప్పిన రష్మి… ఏమైనా సినిమాలు చూసారా అని అనే ప్రశ్నకు …’చాలా చూసాను… వాటి గురించి తర్వాత చెప్తా’ అని బదులిచ్చింది.

Once again Rashmi fires on netizens1

ఇక మీ బ్రేకప్ ను ఎలా భరించారు అని ప్రశ్నించగా.. దయచేసి పర్సనల్ విషయాలు అడగొద్దు. ప్రొఫెషనల్ విషయాలు గురించి అడగండి.. అవి మీకు కనిపిస్తూనే ఉన్నాయి. వాటి గురించే చెబుతాను కూడా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక వంట వచ్చా.. అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘తినడానికి వండుకుంటాను కాని రుచికరంగా చెయ్యడం రాదు అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus