అప్పుడు ప్లాప్ అయ్యింది… ఈ సారి వర్కౌట్ అవుతుందా..?

  • May 6, 2020 / 02:58 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లాక్ డౌన్ లేక పోతే ‘వకీల్ సాబ్’ రిలీజ్ హడావిడి మొదలయ్యేది. మొదట మే 15న ‘వకీల్ సాబ్’ ను విడుదల చెయ్యాలి అని నిర్మాత దిల్ రాజు అలాగే దర్శకుడు వేణు శ్రీరామ్ ప్లాన్ చేసారు. కానీ కుదర్లేదు. ఇదిలా ఉండగా ఈ చిత్రం పూర్తయ్యాక క్రిష్ డైరెక్షన్లో ఓ పీరీయాడికల్ అంశాలతో కూడిన సినిమా చేయనున్నాడు. ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాత.

ఇక అటు తరువాత పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ వంటి కం బ్యాక్ మూవీ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా ఓ మాస్ మసాలా చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్ ‘ వారు నిర్మించనున్నారు.ఇదిలా ఉంటే.. పవన్ 29 వ చిత్రానికి కూడా రంగం సిద్దమయ్యిందని టాక్ వినిపిస్తుంది. పవన్ తో ‘గోపాల గోపాల’ ‘కాటమరాయుడు’వంటి చిత్రాలు చేసిన కిశోర్ పార్థసాని(డాలీ) డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి కూడా పవన్ రెడీ అయ్యాడని తెలుస్తుంది.

‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు అని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ , కథ మాటలు అందించనున్నాడు అని సమాచారం. దర్శకుడుగా మారిన తర్వాత త్రివిక్రమ్.. ‘జై చిరంజీవ’ ‘తీన్ మార్’ వంటి చిత్రాలకు రైటర్ గా పనిచేసాడు. కానీ ఆ రెండు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. మరి ఫలితం ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus