Nagarjuna, Pallavi Prashanth: ఆ విషయంలో మరోసారి గొడవపడిన అమర్ ప్రశాంత్?

  • January 8, 2024 / 10:05 AM IST

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే రోజు విన్నర్ పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం కాకుండా అభిమానులు కాస్త అత్యుత్సాహం చూపించడంతో ఆయన జైలు పాలు కావాల్సి వచ్చింది అయితే ఈయన ప్రస్తుతం బెయిలు మీద బయటకు వచ్చారు.

ఇక పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత ఏ ఇంటర్వ్యూలలో కూడా పాల్గొనలేదు కేవలం సైలెంట్గా ఇంట్లో ఉంటూ తన పనులు తాను చూసుకుంటున్నారు. కానీ మిగిలిన కంటెస్టెంట్ లందరూ కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా నాగార్జున కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా మరోసారి ఏకమయ్యారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా నాగార్జున సినిమా నా సామి రంగ విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ మా వాళ్ళు నా సామిరంగా అనే ఒక సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున తో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇందులో పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ఇందులో భాగంగా అమర్ శోభ ప్రియాంక ఒక బ్యాచ్ కాగా పల్లవి ప్రశాంత్ యావర్ శివాజీ మరొక బ్యాచ్ గా మారారు.

శివాజీ బ్యాచ్ ఊరి పేరు మొగ్గా పురం.. అమర్ వాళ్ళ ఊరిపేరు చుక్కా పురం. వీళ్ళ లక్ష్యం నాగార్జునను వారి ఊరికి తీసుకెళ్లే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలి దీంతో ప్రశాంత్ మరోసారి ఆయనతో గొడవ పడుతూ ఆయనకు సవాల్ విసిరారు. బరాబర్ నాగార్జున సర్ మా ఊరికే వస్తారు.. ఈ విషయంలో తగ్గేదే లే అని సవాల్ విసురుతున్నాడు. లేదు మా ఊరికే వస్తారు అని అమర్ అంటాడు. ఈ విషయంలో అమర్, ప్రశాంత్ మధ్య గొడవ జరుగుతుంది. మరి నాగార్జున చివరికి ఎవరి ఊరికి వెళ్లారో తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus