పవన్ ఫ్యాన్స్ భాధ వర్ణనాతీతం

  • March 28, 2020 / 04:42 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని తల్లకిందులు చేస్తున్న వేళ అగ్ర రాజ్యం అమెరికా సైతం తల్లడిల్లిపోతుంది. ఆక్కడ కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరింది. ఇండియాలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఇక దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలు మూతపడ్డాయి. కొత్త చిత్రాల విడుదల ఆగిపోవడంతో పాటు, షూటింగ్స్ కి కూడా బ్రేక్ పడింది. కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న హిందీ చిత్రం పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ చిత్రంతో పాటు, దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ కూడా హోల్డ్ చేశారు. ఐతే పవన్ దాదాపు రెండేళ్ల తరువాత సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దీనితో ఆయనను వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో కొరోనా వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరో రెండు నెలల్లో పవన్ మూవీ విడుదల కావాల్సివుండగా అది ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి.

వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మే నెలలో వేసవి కానుగా విడుదల చేయాలని భావించారు. ప్రస్తుతానికైతే సాధారణ పరిస్థితులు నెలకొనే మార్గం దగ్గరలో కనిపించడం లేదు. దీనితో పవన్ ఫ్యాన్స్ మరింత నిరాశ, నిస్పృహలలోకి జారుకుంటున్నారు. ఏదిఏమైనా మిగతా హీరోల ఫ్యాన్స్ తో పోల్చుకుంటే పవన్ ఫ్యాన్స్ కి కరోనా దెబ్బ గట్టిగా తగిలింది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus