PS-1: మణిరత్నం సినిమాకి క్రేజీ డీల్!

  • September 13, 2022 / 03:09 PM IST

కోలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సెప్టెంబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో జయం రవి, కార్తీ, విక్రమ్ లాంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు. అలానే ఐశ్వర్యారాయ్, త్రిష లాంటి స్టార్ హీరోయిన్లు కనిపించనున్నారు. కోలీవుడ్ లో అయితే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

కానీ తెలుగులో మాత్రం హైప్ రావడం లేదు. అలానే మిగిలిన భాషల్లో కూడా అంతంతమాత్రంగానే బజ్ ఉంది. దీంతో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనేది సందేహంగానే ఉంది. దాదాపు రెండు భాగాలకు కలిపి రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. పార్ట్ 1 సక్సెస్ అయితే సెకండ్ పార్ట్ బిజినెస్ కి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

నిజానికి ఫస్ట్ పార్ట్ హక్కుల కోసం డీల్ మాట్లాడాలనుకున్నారు. కానీ చివరకు రెండు భాగాలకు కలిపి డీల్ ఫైనల్ చేసినట్లు సమాచారం. మొత్తం అన్ని భాషలకు కలుపుకొని రూ.125 కోట్లకు అమెజాన్ ప్రైమ్ ఈ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ తో పాటు హాట్ స్టార్ కూడా ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం ప్రయత్నించింది.

కానీ అమెజాన్ ఎక్కువ మొత్తాన్ని కోట్ చేయడంతో నిర్మాతలు ఫీల్ ఫైనల్ చేశారట. మొత్తానికి ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాకి సంబంధించిన డీల్ దాదాపు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకి థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus