సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న స్టార్ హీరోలు..!

  • March 17, 2020 / 04:40 PM IST

ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ చాలా రెస్పాన్సిబుల్ గా ప్రవర్తిస్తున్నారు. కరోనా మహమ్మారి నుండీ బయటపడటానికి.. వారి వంతుగా తమ సోషల్ మీడియా నుండీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పై తమదైన శైలిలో జనాలకు మెసేజ్ లు ఇస్తున్నారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీ అనేది జనాకర్షణ కలిగిన పరిశ్రమ అంటారు. వాళ్ళు ఏం చెప్పినా.. ఏం చేసినా.. ఇట్టే జనాల్లోకి వెళ్లిపోతుంటుంది. అందుకే ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం పై ఎన్టీఆర్, రాంచరణ్ లు స్పెషల్ గా ఓ వీడియోను చేసి పోస్ట్ చేశారు.

ఇక వీరి బాటలోనే టాలీవుడ్లో అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్, మహేష్ లు కూడా తమదైన శైలిలో ట్వీట్ లు వేశారు. ప్రభాస్ మాట్లాడుతూ.. ” ఇది చాలా కష్టమైన పరిస్థితి.. అయినప్పటికీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కరోనా వైరస్ నుండీ అందరం జాగ్రత్తగా ఉందాం. దానిని ఎదుకోవడానికి కావాల్సిన పద్ధతుల్ని పాటిద్దాం” అంటూ తన ఫేస్ బుక్ ద్వారా పేర్కొన్నాడు. ఇక మహేష్ బాబు.. “కరోనా వైరస్ నుండీ మనల్ని మనం కాపాడుకోవడానికి.. అందరూ సామాజికంగా దూరం పాటించాల్సిన టైం వచ్చింది. అందరం మన ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కష్టమే కానీ పాటించక తప్పదు” అంటూ పేర్కొన్నాడు.

1

2

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus