సుజీత్ చిత్రం తర్వాత చేసే డైరక్టర్ పేరు వెల్లడించిన ప్రభాస్
- April 18, 2017 / 01:06 PM ISTByFilmy Focus
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా పక్కా ప్లాన్ చేశారు. బాహుబలి కంక్లూజన్ తర్వాత డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వకముందే నెక్స్ట్ ప్రాజక్ట్ ని ప్రభాస్ ఒకే చేశారు.
సుజీత్ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు నిన్న జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ స్పష్టం చేశారు. జిల్ సినిమాను డైరక్ట్ చేసిన రాధాకృష్ణకు భారీ ప్రాజక్ట్ ని అందిచడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభాస్ 20 మూవీ మూడు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనిని కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















