హైదరాబాద్‌కు మకాం మార్చనున్న ప్రశాంత్ నీల్

  • May 4, 2022 / 09:16 PM IST

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండియా వైడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకుంది ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ను కూడా ఇతను మించిపోయాడు. తక్కువ బడ్జెట్‌లో పాన్ ఇండియా సినిమాను తీసి.. రూ.1000 కోట్లు గ్రాస్ కొల్లగొట్టిన దర్శకుల్లో రాజమౌళి తర్వాతి స్థానంలో ప్రశాంత్ నీల్ నిలిచాడు. హిందీలో కూడా ఈ మూవీ అక్కడ టాప్ మూవీస్ కలెక్షన్లను అధిగమిస్తోంది.

సో… ప్రశాంత్ నీల్‌కు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అయితే కన్నడలో ఇతని స్టార్ ఇమేజ్‌ను మేనేజ్ చేసే హీరోలు లేరు. యశ్ ఎలాగూ ఇప్పుడు తను కమిట్ అయిన సినిమాలతో బిజీగా వున్నాడు. అతనితో సినిమా చేయాలంటే మరో రెండు మూడేళ్ల వరకు ఆగాల్సి వుంటుంది. కాబట్టి ప్రశాంత్ నీల్ కూడా మన టాలీవుడ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ నీల్..

ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక.. ఎన్టీఆర్‌తో మూవీ చేయనున్నాడు. అది యంగ్‌టైగర్‌కు 31వ సినిమా కావడం విశేషం. ఆ తర్వాత రామ్ చరణ్, మహేశ్‌లతోనూ సినిమాలు అంటున్నారు. మహేశ్‌తో రాజమౌళి సినిమా తీస్తున్నాడు కాబట్టి.. అతన్ని పక్కనపెట్టేసినా చరణ్‌తో సినిమా వుండే అవకాశాలు వున్నాయి. కాబట్టి ఈ మూడేళ్ల పాటు ప్రశాంత్ నీల్ హైదరాబాద్‌లోనే వుండాల్సి వుంటుంది.

అందుకే భాగ్యనగరానికి మకాం మార్చాలనే ప్లాన్ ప్రశాంత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే తనకున్న సర్కిల్స్‌తో ఇక్కడ ఓ ఇళ్లు చూసిపెట్టమని చెప్పాడని ఫిలింనగర్ టాక్. అంతా అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ప్రశాంత్ నీల్ కేరాఫ్ హైదరాబాద్‌ వుండే అవకాశం వుంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus