యమదొంగ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ సరసన ప్రియమణి
- November 30, 2018 / 11:32 AM ISTByFilmy Focus
అప్పుడెప్పుడో “యమదొంగ” సినిమాలో కలిసి నటించిన ఎన్టీఆర్-ప్రియమణి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కలిసి ఒకే సినిమాలో కనిపించనున్నారు. అది కూడా రాజమౌళి సినిమాలోనే. విషయం ఏంటంటే.. ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ ఆర్ ఆర్”లో ప్రియమణి ఓ కీలకపాత్ర పోషించనుందట. ఇది నిజమా కాదా అనేది ఇంకా టీమ్ కన్ఫర్మ్ చేయాల్సి ఉన్నప్పటికీ.. ప్రియమణిదీ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ అని, “బాహుబలి”లో రమ్యకృష్ణ స్థాయి రోల్ అని ఫిలిమ్ నగర్ లో చర్చలు జరుగుతుండడంతో.. ఒకవేళ నిజంగా ప్రియమణి గనుక ఈ ప్రొజెక్ట్ లో ల్యాండ్ అవ్వగలిగితే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను సూపర్బ్ కిక్ స్టార్ట్ దొరికినట్లే.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ అయిన ప్రియమణి గత కొన్నాళ్లుగా సరైన ఆఫర్లు రాకపోవడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతోపాటు.. టీవి షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో రాజమౌళి సినిమా పడింది అంటే ఆమె మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అవ్వడం ఖాయం.












