Puneeth Rajkumar: అప్పూను చూసి ఆ అభిమాని గుండె ఆగిందా?

  • March 20, 2022 / 02:23 PM IST

దేశంలో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు. అయితే వాళ్లలో దానగుణం, మంచితనం ఉన్నవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. అలా దానగుణం, మంచితనం ఉన్నవాళ్లలో పునీత్ రాజ్ కుమార్ కూడా ఒకరు. తను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని పునీత్ రాజ్ కుమార్ సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేశారు. పునీత్ తను చేసిన సేవాకార్యక్రమాలను సైతం ప్రచారం చేసుకోలేదు. పునీత్ మరణం తర్వాతే ఆయన సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Click Here To Watch NEW Trailer

పునీత్ చివరి సినిమా జేమ్స్ గురువారం రోజున పునీత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. పునీత్ మరణించిన సమయంలో ఆయన మరణవార్తను తట్టుకోలేక కొంతమంది అభిమానులు చనిపోయారు. జేమ్స్ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ పాత్రకు శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. పునీత్ మరణం వల్ల ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో స్వల్పంగా మార్పులు చేశారు.

జేమ్స్ సినిమాను తొలిరోజే థియేటర్లలో చూడటానికి అభిమానులు క్యూ కట్టారు. స్క్రీన్ పై పునీత్ ను చూసిన అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పునీత్ ను స్క్రీన్ పై చూస్తూ ఒక అభిమాని గుండె ఆగింది. కర్ణాటక రాష్ట్రంలోని నంజనగూడు గ్రామానికి చెందిన 22 సంవత్సరాల వయస్సు ఉన్న ఆకాశ్ అనే కుర్రాడు ఇతర ఫ్యాన్స్ తో సినిమా చూస్తూ హార్ట్ అటాక్ తో మృతి చెందారు.

పునీత్ మరణించినప్పటి నుంచి ఆకాశ్ బాధపడుతూనే ఉన్నాడని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆకాశ్ కు గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆకాశ్ మృతికి పునీత్ అభిమానులు సంతాపం తెలియజేశారు. పునీత్ రాజ్ కుమార్ రీల్ లైఫ్ లోనే కాదని రియల్ లైఫ్ లో కూడా హీరోనేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus