ఇజం తర్వాత చేయనున్న సినిమాలపై క్లారిటీ

  • October 3, 2016 / 11:44 AM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోయిజాన్ని పెంచే పనిలో స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై  కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమాకి తుది మెరుగులు దిద్దుతున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ తన తర్వాతి ప్రాజెక్ట్ ల గురించి మీడియాకు వివరించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మళ్లీ సినిమాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ హీరోలతో డైరక్టర్ చేసిన పోకిరి, టెంపర్ సూపర్ హిట్ గా నిలిచాయి. తన కెరీర్ లో బెస్ట్ చిత్రాలుగా నిలిచిపోయే హిట్లు ఇచ్చిన హీరోల కోసం కథలను సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. అయితే ముందుగా ఏ హీరో మూవీ తెరకెక్కనుందో.. ఆ విషయాన్ని పూరి చెప్పలేదు. జనతా గ్యారేజ్ తర్వాత తారక్ ఎవరితో సినిమా చేస్తారో.. ఇంతవరకు ప్రకటించలేదు. పూరి జగన్నాథ్ మాటలను బట్టి చూస్తే, ఈ డైరక్టర్ కాంబినేషన్లో ఎన్టీఆర్ మూవీ చేయనున్నట్లు అర్ధమవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus