‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత పూరి తో చరణ్ మూవీ ఫిక్స్..?

  • August 4, 2020 / 07:47 PM IST

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్న చరణ్.. ఆ తరువాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. చెప్పాలంటే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ ఏర్పడుతుందనే చెప్పాలి. అసలు మ్యాటర్ ఏంటంటే.. చరణ్ తో సినిమా చెయ్యడానికి వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల, సురేందర్ రెడ్డి వంటి దర్శకులు రెడీగా ఉన్నారు. అయితే చరణ్.. ఇంకా ఎవ్వరికీ ఫిక్స్ అవ్వలేదు. కానీ ఆ ముగ్గురు దర్శకులు మాత్రం చరణ్ తో సినిమా చెయ్యాలని స్క్రిప్ట్ లు రెడీ చేసుకుంటున్నారు.

ఇప్పుడు వీరి లిస్ట్ లో మరో డైరెక్టర్ కూడా జాయిన్ అయినట్టు వినికిడి. అతనెవరో కాదు మన పూరి జగన్నాథె..! వివరాల్లోకి వెళితే.. ఇటీవల చరణ్ ను కలిసిన పూరి ఓ స్క్రిప్ట్ ను వినిపించాడట. వీరిద్దరి మధ్య చాలా సేపు డిస్కషన్ నడిచిందట. దాంతో వీరి కాంబినేషన్లో సినిమా ఉంటుందంటూ వార్తలు మొదలయ్యాయి. మరోపక్క చిరు కోసం కూడా పూరి స్క్రిప్ట్ ను డెవలప్ చేస్తున్నట్టు భోగట్టా. అయితే చరణ్ తో పూరి సినిమా గ్యారెంటీ అనే మాత్రం బలంగా వినిపిస్తుంది.

ఈ ప్రాజెక్టుని కె.యస్. రామారావు నిర్మించడానికి రెడీగా ఉన్నట్టు కూడా టాక్.! గతంలో ‘చరణ్ తో ఓ సినిమా చేయిస్తాను’ అని కె.ఎస్.రామారావు గారికి చిరు మాట ఇచ్చారు. ‘తేజ్ ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా అందరి ముందు చిరు ఈ విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.చిరు మాటని నిలబెట్టడానికి చరణ్ ఈ ప్రాజెక్టు కి అంగీకారం తెలిపేసాడని టాక్. అయితే అది 2022 లోనే సాధ్యమవుతుంది..! ఎందుకంటే 2021 సంవత్సరం మొత్తం చరణ్.. ‘ఆర్.ఆర్.ఆర్’ తోనే బిజీగా ఉండే అవకాశం ఉంది. ఇక చరణ్ ను ‘చిరుత’ తో హీరోగా పరిచయం చేసిందే పూరి కాబట్టి.. ఇది ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అనే చెప్పాలి..!

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus