Purushothamudu: ‘పురుషోత్తముడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • July 27, 2024 / 01:41 PM IST

రాజ్ తరుణ్  (Raj Tarun)  హీరోగా ‘పురుషోత్తముడు’ అనే సినిమా రూపొందింది. రామ్ భీమన డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్’ సంస్థ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. హాసిని సుధీర్.. రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. జూలై 26న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్స్ …పర్వాలేదు అనిపించాయి. మరోపక్క లావణ్యతో వివాదం వల్ల రాజ్ తరుణ్ గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్న తరుణంలో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ‘పురుషోత్తముడు’ పై ప్రేక్షకుల దృష్టి పడింది.

మరి ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎలా జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత వంటి వివరాలు తెలుసుకుందాం రండి :

నైజాం 0.50 cr
సీడెడ్ 0.15 cr
ఉత్తరాంధ్ర 0.20 cr
ఈస్ట్+వెస్ట్ 0.08 cr
కృష్ణా+గుంటూరు 0.13 cr
నెల్లూరు 1.06 cr
ఏపి+తెలంగాణ 1.12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.10 cr
వరల్డ్ వైడ్(టోటల్) 1.22 cr

‘పురుషోత్తముడు’ సినిమా చాలా వరకు రెంటల్ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. వాటి వాల్యూ రూ.1.22 కోట్లుగా ఉంది. సో బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా రూ.1.8 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి ఆ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus